భారీ మెజారిటీతో టీడీపీ విజయం

Published: Wednesday July 11, 2018
2019 ఎన్నికల్లో అసలు సిసలైన సినిమా ఉంటుంది. భారీ మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారు’ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయ à°¨ పాల్గొన్నారు. బహిరంగ సభల్లో మాట్లాడారు. ‘2014 లో రాష్ట్రాన్ని అడ్డంగా విభజించారు. ఆర్థిక కష్టాల నడుమ పాలన బాధ్యతలు చేపట్టిన మన చంద్రన్న ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అందుకే అభివృద్ధి పుత్రుడు చంద్ర న్న అయితే.. అవినీతి పుత్రుడు జగన్‌. ప్రధాని మోదీ దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌’ అని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం వెన్నుపోటు పొడిస్తే.. జగన్‌, పవన్‌ ప్రధానిని ఒక్కమాట అనరని.. ఆయనను ఏమైనా అంటే జైలుకెళ్తాననే భయంతో జగన్‌ నోరెత్తడం లేదని చెప్పారు.
 
‘68 ఏళ్ల వయస్సులో రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న చంద్రబాబును నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మన పిల్లలకు ఇవే నేర్పుతామా? చంద్రబాబు కాలర్‌ పట్టుకోవాలంటున్నారు.. తుపాకీతో కాల్చాలంటున్నారు.. గ్రామానికి వస్తే తరిమి కొట్టాలని జగన్‌ అంటున్నారు. గ్రామానికి రోడ్లేసినందుకు తరిమి కొట్టాలా..? వృద్ధుల పింఛన్లు ఐదు రెట్లు పెంచి రూ.వెయ్యి చేసినందుకు తరిమికొట్టాలా..? గుంటూరు సభలో పవన్‌ నాపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయనకు సవాల్‌ విసురుతున్నా. దమ్ము ధైర్యం ఉంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు.