పవన్‌పై మంత్రి గంటా ఫైర్‌

Published: Wednesday July 11, 2018
 à°œà°¨à°¸à±‡à°¨ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అవాకులు..చవాకులతో గాలి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు. ఆయన కళ్లుండీ చూడలేని కబోది అని దుయ్యబట్టారు. à°’à°• రాజకీయ పార్టీ స్థాపించిన వ్యక్తి వాస్తవాలు తెలియకుండా నిందలు మోపుతున్నారని ఆక్షేపించారు. మంగళవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. à°ˆ సందర్భంగా పవన్‌కు 25 ప్రశ్నలు సంధించారు. ‘కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెడితే మద్దతు కూడగడతానని ప్రకటించి.. à°† తర్వాత పత్తా లేకుండా పోయారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి దేశమంతా మద్దతు పలికితే మీరు మాట్లాడలేదు. కేంద్రం సాయంపై ఏర్పాటుచేసిన జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు?
 
కాపుల రిజర్వేషన్‌కు కట్టుబడిన రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానంచేసి పంపిన బిల్లును కేంద్రం ఆమోదించకపోయినా మోదీని ఎందుకు ప్రశ్నించరు? విభజన హామీలను నెరవేర్చకుండానే అమలుచేశామని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలుచేసిన కేంద్రాన్నిఎందుకు నిలదీయరు? ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి మాట్లాడే మీరు.. రాష్ట్రంలో ఏడు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు? విశాఖకు రైల్వేజోన్‌ కోసం టీడీపీ ఎంపీలు దీక్షలుచేస్తే సంఘీభావం తెలపకుండా విమర్శలు చేస్తారా? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అవినీతి కేసుల్లో ఏడాదిలోగా తీర్పు వెలువడాలి. కానీ జగన్‌ కేసు నత్తనడకన సాగుతుంటే ఎందుకు మాట్లాడరు? జగన్‌, మోదీతో మీ కుమ్మక్కుకు ఇవన్నీ రుజువులు కావా? à°—à°¤ ఎన్నికల్లో మీ ప్రచారం వల్లే టీడీపీ విజయం సాధించిందని అంటున్నారు.