బెంగళూరు బార్ లో అగ్నిప్రమాదం

Published: Monday January 08, 2018

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కలసిపాళ్య ప్రాంతంలోని కైలాశ్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఉదయం మంటలు వ్యాపించాయి. దీంతో బార్‌లో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులు సజీవదహనమయ్యారు. మృతుల్లో 24 ఏళ్ల యువతి కూడా ఉన్నట్లు పొలిసుల సమాచారం.

 

తెల్లవారుజామున 2.30 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో మంటలు వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేటప్పటికి అంతా దగ్ధం అయిపోయింది. శకటాలు మంటలు అదుపుచేసేలోపే బార్‌లో ఉన్న ఐదుగురూ మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.