టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడి

Published: Saturday July 28, 2018
 à°Ÿà±€à°¡à±€à°ªà±€ నాయకులపై వైసీపీ నాయకులు దాడిచేసి గాయపరిచిన సంఘటన మండలంలోని చెన్నరాయపట్నం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ హారున్‌బాషా తెలిపిన మేరకు... చెన్నరాయపట్నంకు చెందిన టీడీపీ కార్యకర్త కుళ్లాయప్ప తన బంధువులతో కలిసి వ్యవ సాయ తోటలో పొలం పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో బత్తలపల్లిలో జరి గే వైసీపీ బైక్‌ ర్యాలీకి హాజరయ్యేందుకు చె న్నరాయపట్నం వైపు నుంచి వైసీపీ నాయ కులు బయల్దేరారు. కుళ్లాయప్ప తోటవద్దకు రాగానే బైకులు ఆపి అతడిని కూడా ర్యాలీకి రమ్మని పిలిచారు. నేను రానని కుళ్లాయప్ప తెలిపాడు. దీంతో వైసీపీ కార్యకర్తలు మూకు మ్మడిగా వారిపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈదాడిలో కుళ్లాయప్ప, సత్యనారా యణ, నరసింహులు, సత్యమయ్య, చంద్రప్ప తీవ్రంగా గాయపడ్డారు.
 
 
దాడి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను ధర్మవరం ఆస్పత్రికి తర లించారు. కుళ్లాయప్ప, నరసింహులు, సత్య నారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. బాధి తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు à°¨ మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. à°ˆ ఘటనలో వైసీపీ వర్గానికి చెందిన పోతిరెడ్డి, ఈశ్వరయ్య, అనిల్‌కుమార్‌ కూడా స్వల్పంగా గాయపడ్డట్టు సమాచారం. మండల టీడీపీ నాయకులు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.