పవన్‌ పర్యటన రద్దయ్యింది.

Published: Monday August 13, 2018

క్షత్రియ కార్పొరేషన్‌ సాధన సమితి సమావేశ ప్రాంగణంలోని అల్లూరి విగ్రహానికి జనసేనాని పూలమాలలు వేసే కార్యక్రమం రద్దయ్యింది. క్షత్రియ సామాజిక వర్గంలోని కొందరు పవన్‌ను పూలమాలలు వేయటానికి ఆహ్వానించినట్లు సమాచారం. పవన్‌ అంగీకరించటంతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది ముందుగానే వచ్చి తనిఖీలు ప్రారంభించారు. ఇది గమనించిన కొందరు యువకుల వచ్చి ఇక్కడికి ఎవరు రమ్మన్నారంటూ వాగ్వాదానికి దిగారు. రాజకీయాలకతీతంగా జరుగుతున్న à°ˆ సమావేశానికి పవన్‌ను ఆహ్వానించడం ఏమిటంటూ కొందరు ప్రశ్నించారు. గందరగోళం చెలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు చేరుకున్నారు. బౌన్సర్లను హెచ్చరించడంతో వారు వెళ్ళిపోయారు. à°ˆ నేపథ్యంలో పవన్‌ పర్యటన రద్దయ్యింది.