వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం

Published: Tuesday August 14, 2018

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం దగ్గర వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. మంగళవారం ఉదయం వృద్ధ దంపతులు తుంగభద్ర వంతెనపైకి చేరుకుని అక్కడి నుంచి నదిలోకి దూకారు. ఈ ఘటనలో వృద్ధురాలు మృతి చెందగా, వృద్ధుడిని స్థానికులు రక్షించారు. అయితే కుమారులు పట్టించుకోవడంలేదనే మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు