నేతల అరెస్ట్‌లను ఖండిస్తూ నేడు రౌండ్‌టేబుల్‌

Published: Tuesday September 04, 2018

విజయవాడ: à°ªà±Œà°°à°¹à°•à±à°•à±à°² నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎంబీ విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంబీ విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌ కె.ఎస్‌.సి. బోస్‌ సోమవారం à°’à°• ప్రకటనలో తెలిపారు. ఏపీ పౌరహక్కుల సంఘం, ఆలిండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం, ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌, ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌లు సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులను కాపాడుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ప్రజాసంఘాలు, సంస్థల ప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.