నాగుల పూజలో పాల్గొన్న సి ఎం

Published: Monday January 15, 2018

స్వగ్రామం నారావారిపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. కుటుంబసమేతంగా ఉదయం 10:40 గంటలకు కుటుంబ సంప్రదాయం ప్రకారం నాగాలమ్మ కట్టను దర్శించి నాగుల పూజ చేశారు. నారావారి కుటుంబంతో పాటు నందమూరి బాలకృష్ణ, వారి కుటుంబసభ్యులు పూజలో పాల్గొన్నారు. అనంతరం తల్లిదండ్రుల సమాధులను సందర్శించిన చంద్రబాబు వారికి నివాళులర్పించారు. సీఎం రాకతో నారావారిపల్లెలో కోలాహలం నెలకొంది. బంధువులు, చిన్ననాటి స్నేహితులతో చంద్రబాబు ఉత్సాహంగా పండుగ జరుపుకుంటున్నారు.