2019 లోపు 5000 ఉద్యోగాలు : మంత్రి నారా లొకేష్

Published: Friday January 19, 2018

 5వేల మందికి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. శుక్రవారం అమరావతిలో మంత్రి సమక్షంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్ధికి కోవలెంట్ ఫండ్, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. à°ˆ సందర్బంగా లోకేశ్ మాట్లాడుతూ... బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సమాచారానికి రక్షణ కల్పిస్తున్నామని, రాజధానిలో భూరికార్డుల ట్యాంపరింగ్ జరగకుండా చూస్తున్నామని తెలిపారు. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటుకు కోవలెంట్ ఫండ్‌తో ఒప్పందం ఉపయోగపడుతుందని, బ్లాక్ చైన్ టెక్నాలజీలో స్టార్టప్ కంపెనీల అభివృద్ధికి కోవలెంట్ ఫండ్ సహకారం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.