పూర్తిస్థాయి రాజకీయాల్లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Published: Monday January 22, 2018

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామికి పూజలు చేసి, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయనున్నారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన అంజన్నకు పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి కూడా వెళ్లనున్నారు. దీనికి సమయం తీసుకునే అవకాశాలున్నాయి. పవన్ కొండగట్టు అంజన్నకు పూజలు చేసి తాను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా చెప్పారు. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో తనకు ప్రమాదం జరిగిందని, అప్పుడు అంజన్న వల్లే బతికిబయటపడ్డానని చెబుతున్నారు. మరోవైపు ఆంజనేయస్వామి తమ ఇలవేల్పు అన్నారు. అందుకే రాజకీయాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.