ప్రధాని మోదీపై అన్నాహజరే విమర్శలు

Published: Monday January 22, 2018

ప్రధాని మోదీపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజరే విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీకి అహం పెరిగిపోయిందని అన్నారు. అందువల్లే మూడేళ్ల నుంచి తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా అట్‌పడీలో à°“ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ‘ప్రధాని మోదీకి మూడేళ్లలో 30à°•à°¿ పైగా లేఖలు రాశాను. కానీ ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదు. మోదీకి ప్రధానినన్న అహం పెరిగిపోయింది. అందువల్లే సమాధానం ఇవ్వడం లేదు’ అన్నారు. ఇప్పటికేమార్చి 23à°¨ జన్‌లోక్‌పాల్‌, రైతుల కోసం భారీ ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. à°ˆ నేపథ్యంలోనే ప్రజల మద్దతు కోసం అట్‌పడీలో ర్యాలీ నిర్వహించారు.