పద్మావతి సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తు ఖడ్గాం చేతపట్టీన రాజ్‌పుత్ మహిళలు

Published: Monday January 22, 2018

పద్మావతి సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనను తీవ్రతరం చేసింది. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్లో రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఖడ్గాలతో రోడ్లెక్కారు. పట్టణంలో ఆదివారం రాజ్‌పుత్‌à°² స్వాభిమాన్ ర్యాలీ జరిగింది. à°ˆ ర్యాలీలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. పద్మావతి సినిమా విడుదల నిర్ణయాన్ని విరమించుకోవాలని.. లేని పక్షంలో మంటల్లో దూకి ఆత్మాహుతికి పాల్పడతామని రాజ్‌పుత్ మహిళలు చిత్ర బృందాన్ని హెచ్చరించారు. రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన 1,908 మంది మహిళలు సినిమాను విడుదల చేస్తే మంటల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడతామని సంతకాలు కూడా చేశారు. à°ˆ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, జిల్లా కలెక్టర్‌కు మెమొరాండం పంపారు. ఇదిలా ఉంటే, à°ˆ సినిమా విడుదల కాబోతున్న కొన్ని థియేటర్లపై నిరసనకారులు ఇప్పటికే దాడి చేసిన సంగతి తెలిసిందే.