బీజేపీతో పొత్తుపై వైసీపీ అధినేత జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published: Tuesday January 23, 2018

అమరావతి: బీజేపీతో పొత్తుపై ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత జగన్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. మరో ఆలోచన లేకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న పాదయాత్ర 900 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. à°ˆ సందర్భంగా సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ చానెల్‌à°•à°¿ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ à°ˆ మేరకు వ్యాఖ్యానించారు.హోదా ఇచ్చే అధికారం ప్రధానమంత్రికి ఉందని, ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా 2019 లో బీజేపీతో కలిసి నడవటానికి అభ్యంతరం లేదన్నారు.