ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరి

Published: Tuesday January 23, 2018

ఎమ్మెల్యే రోజా ఇంట్లో దొంగతనం జరిగింది. నాలుగు వెండి పళ్లేలు, సుమారు రెండు కిలోల వెండి, 14 తులాల బంగారాన్ని దొంగలు చోరీ చేసినట్లు రోజా భర్త సెల్వమణి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. మణికొండ పంచవటి కాలనీలో ఉండే రోజా à°ˆ నెల 11à°¨ కుటుంబంతో ఊరెళ్లారు. 12à°¨ పనిమనిషి రామకుమారి ఇంటికి తాళంవేసి పక్కింటివారికిచ్చి సంక్రాంతికి ఊరెళ్లింది. 18à°¨ తిరిగి వచ్చింది. ఇల్లు శుభ్రం చేస్తుండగా కిచెన్‌లో ఉన్న 4వెండి పళ్లేలు కనిపించక పోవడంతో ఆమె సెల్వమణికి ఫోన్‌ చేసి చెప్పింది. సెల్వమణి సోమవారం ఉదయం వచ్చి పరిశీలించగా బెడ్‌రూంలోని కప్‌బోర్డులో ఉన్న ఆభరణాలు పోయినట్లు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.