ఘనంగా రథసప్తమి వేడుకలు : అరసవెల్లి

Published: Wednesday January 24, 2018

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వేడుకలను ప్రారంభించారు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ప్రముఖులు, స్వామీజీలు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.