‘పరిపూర్ణానంద వ్యాఖ్యలు సరికాదు’

Published: Thursday November 22, 2018

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో ఆలయాల్లో అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయని, పూజారులపై దాడులు జరుగుతున్నాయంటూ స్వామి పరిపూర్ణానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నాయకుడు కె.బుచ్చిరామ్‌ప్రసాద్‌ అన్నారు. బుధవారం గుంటూరులో మాట్లాడిన ఆయన బ్రాహ్మణులపై దాడులు జరిగినా, ఆలయాల వద్ద అన్యమత ప్రచారాలు జరిగినా పరిపూర్ణానంద.. ప్రభుత్వం దృష్టికి తీసుకురావస్తే, ప్రభుత్వం à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఎక్కడాలేవని చెప్పారు. బ్రాహ్మణులకు ఎన్నడూ లేని విధంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయటంతోపాటు పరిషత్తుతో పూజారుల సంక్షేమం కోసం చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.