దారుణం విశాఖలో రైల్వే ఉద్యోగి హత్య

Published: Thursday January 25, 2018

రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఏయూ క్వార్టర్స్‌లో ఉంటున్న వెంకటరమణ అనే ఉద్యోగి హత్యకు గురయ్యాడు. కాగా... ఈయన హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇదిలా ఉండగా ఏయూ ఉద్యోగి వరప్రసాద్, తన బంధువు జగదీశ్‌తో కలిసి వెంకటరమణను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.