డ్రైవింగ్ చేస్తుండగా ఫ్యాంటు జేబులో పేలిన సెల్ ఫోన్

Published: Friday December 28, 2018

శ్రీకాకుళం: à°ªà°²à°¾à°¸-కాశీబుగ్గ మున్సిపాలిటీ 8à°µ వార్డు బ్రాహ్మణవీధికి చెందిన గోవిందపాత్రోకు చెందిన సెల్‌ఫోన్‌ గురువారం పేలిపోయింది. గోవిందపాత్రో తన ఫోన్‌కు ఫుల్‌ చార్జింగ్‌ పెట్టి ఫ్యాంటు జేబులో పెట్టాడు. అనంతరం పనుల కోసం తోటకు వెళ్లి ట్రాక్టర్‌ నడుపుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఫోన్‌ పేలిపోయింది. ఫ్యాంటు నుంచి మంటలు రావడంతో తోటి కార్మికులు గుర్తించి ఆపేశారు. తొడ భాగానికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయన స్థానిక à°’à°• పైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. అనంతరం సెల్‌ఫోన్‌ కొనుగోలు చేసిన దుకాణానికి వెళ్లి విషయాన్ని చెప్పగా వారు తమకు సంబంధం లేదని చెప్పారు. దీనిపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించనున్నట్టు గోవిందపాత్రో చెప్పాడు.