మద్యం నిషేధిస్తే

Published: Thursday January 17, 2019

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామం లో మద్యాన్ని నిషేధిస్తే గ్రామాన్ని దత్తత తీసుకుంటానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి మండలంలోని పమిడిపాడులో శ్రీ వలేరు వెంకటసుబ్బయ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు లక్ష్మీనారాయణ బహుమతులు ప్రదానం చేశారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులను తామే వినియోగదారునికి చేర్చగలిగితే గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.