కోర్టుకెళ్లేది జగన్....ప్రజల్లోకి వెళ్లేది నేను

Published: Sunday February 03, 2019
అమరావతి: à°µà±ˆà°¸à±€à°ªà±€à°ªà±ˆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ నమ్మకానికి ప్రతీక టీడీపీ... అపనమ్మకానికి ప్రతీక వైసీపీ అని వ్యాఖ్యానించారు. టీడీపీని నమ్మితే నష్టం రాదని రాజధానికి రైతులు భూములు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అమరావతిలో రూ.50వేల కోట్ల విలువైన పనులు పూర్తవుతున్నాయన్నారు. అధికారుల ప్రతిష్ట పెంచింది టీడీపీ అని.. అధికారులను జైలుపాలు చేసింది వైసీపీ అని విమర్శించారు. వారి హయాంలో ఫోక్స్‌ వ్యాగన్‌ పోయిందని.. టీడీపీ హయాంలో à°•à°¿à°¯ వచ్చిందని చెప్పుకొచ్చారు. పోగొట్టేది వైసీపీ అయితే రాబట్టేది టీడీపీ అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లేది జగన్‌... ప్రతిరోజు ప్రజల్లో ఉండేది తాను అని అన్నారు. ఏ పార్టీ ఎలాంటిదో ప్రజలు బేరీజు వేసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.