బీజేపీ సభకు జనం కరువు

Published: Tuesday February 05, 2019
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌à°·à°¾ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ జనం లేక వెలవెల పోయింది. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో అమిత్‌à°·à°¾ సభ ఏర్పాటు చేశారు. రైల్వే కాలనీ జగన్నాథ రథయాత్ర ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగే సభలో à°·à°¾ ప్రసంగిస్తారని బీజేపీ జిల్లా నేతలు మొదట తెలియజేశారు. ఇందుకోసం సన్నాహాలు చేశారు. సుమారు 3 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
 
కానీ, మధ్యాహ్నం మూడు గంటలైనా సభావేదిక వద్దకు జనాలు రాలేదు. దీంతో కుర్చీలను ఒకవైపు మాత్రమే ఉంచి.. రెండో వైపు తీసేసి.. అక్కడ బస్సును నిలిపారు. సాయంత్రం 4 గంటలకు à°·à°¾ హెలికాప్టరులో ప్రభుత్వ హైస్కూలు మైదానంలో దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించేందుకు 40 నిమిషాల సమయం కేటాయించారు. సభకు రెండు మూడొందలమంది కూడా రాకపోవడం చూసి బీజేపీ నేతలు నిరాశ చెందారు. అమిత్‌షాను వేదికపైకి కూడా తీసుకురాలేదు. ఆయన బస్సు యాత్రను ప్రారంభించాక అదే బస్సెక్కించారు. అక్కడి నుంచే అమిత్‌à°·à°¾ ప్రసంగించారు.