గుడిలో పూజారిలా సభకొస్తున్నా

Published: Saturday February 09, 2019
స్పీకర్‌à°—à°¾ ఎన్నికైనప్పటి నుంచి అసెంబ్లీకి గుడిలో పూజారిలా వస్తున్నానని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో కొత్తరాష్ట్రంలో మొదటి శాసనసభ స్పీకర్‌à°—à°¾ ఎన్నికైనప్పటి నుంచి సభలో తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. à°—à°¤ నాలుగు సమావేశాల నుంచి ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడం దురదృష్టకరమని స్పీకర్‌ వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ఎందుకు ప్రకటించలేదని కొందరు ప్రశ్నించారని, అదే సమయంలో అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకిస్తున్నారని కూడా చాలామంది అడిగారని చెప్పారు.
 
వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదని ప్రశ్నించారని గుర్తు చేశారు. కిడారి మరణం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధితో అన్ని వర్గాల వారూ సంతోషంగా ఉన్నారని, మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.