ఈసారి గణతంత్ర దినోత్సవాల్లో రికార్డుల మోత : నరేంద్ర మోదీ

Published: Sunday December 31, 2017

 à°ªà±à°°à°¤à°¿ సంవత్సరం జరుపుకునే గణతంత్ర దినోత్సవాల కన్నా 2018లో నిర్వహించే గణతంత్ర దినోత్సవాల్లో గొప్ప ఘనత నమోదు కాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం ఆయన ‘మన్ à°•à±€ బాత్’ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ 2018 జనవరి 26à°¨ జరిగే గణతంత్ర దినోత్సవాలకు 10 ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం) దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని చెప్పారు. ప్రపంచంలోని పది దేశాల అధినేతలు à°ˆ వేడుకలకు హాజరు కావడం భారతీయులందరికీ గర్వకారణమని వివరించారు. భారతీయులందరికీ జనవరి 26 చారిత్రక పండుగ అని, 2018 జనవరి 26ను అనేక సంవత్సరాలపాటు గుర్తుంచుకునే విధంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పది మంది ముఖ్య అతిథులు హాజరుకావడం ఇదే మొదటిసారి అని తెలిపారు.