సీఎం జగన్‌పై ‘దిశ’ చట్టం

Published: Friday January 10, 2020
 à°¸à±€à°Žà°‚ జగన్మోహన్ రెడ్డి నియమించింది హైపవర్‌ కమిటీనా?.. పవర్‌ లేని కమిటీనా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి అనిత ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ఇంతమంది మహిళలను బాధించిన సీఎంపై ‘దిశ’ చట్టం పెట్టాలన్నారు. గుడికి వెళ్లే మహిళలపై కూడా జగన్ తన ప్రతాపం చూపిస్తున్నారంటే.. ఆయనను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌à°—à°¾ లెక్కించాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై ముఖ్యమంత్రి దాడులు చేయిస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టిలో పెట్టుకుని ‘దిశ’ చట్టం జగన్‌పై పెట్టాలన్నారు.
 
వైసీపీ ప్రభుత్వం à°’à°• విషయం గుర్తు పెట్టుకోవాలని అనిత అన్నారు. టీడీపీ కార్యకర్తలను టచ్‌ చేసే మగాడు ఇప్పటి వరకు లేడన్నారు. కాంట్రవర్సీ చేస్తారో కేసులే పెట్టుకుంటారో పెట్టుకోండంటూ ఆమె సవాల్ చేశారు. మహిళలపై దాడులు చేస్తుంటే హోంమంత్రి స్పందించరా? అని అనిత మండిపడ్డారు. అమరావతిని రక్షించుకోవడానికి నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గాజులిస్తే..దాన్ని కూడా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో జరిగే ప్రతి చావుకు సీఎం జగన్‌దే బాధ్యతని అనిత అన్నారు.