తగ్గుతాయిగానీ..మినహాయింపులు ఉండవ్‌

Published: Sunday February 02, 2020
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన కొత్త ఆదాయపన్ను విధానంలో పన్ను రేట్లు తగ్గుతాయిగానీ.. పాత విధానంలో ఇచ్చిన పలు మినహాయింపులు, తగ్గింపులు పోతాయి. అవేంటంటే..

80సీ, 80సీసీసీ, 80సీసీడీ సెక్షన్ల à°•à°¿à°‚à°¦ గరిష్ఠంగా లభించే రూ.1.5 లక్షల మినహాయింపు పోతుంది. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌), ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌), బ్యాంకులో వేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఆరోగ్య బీమా, ఎల్‌ఐసీ ప్రీమియమ్‌లు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు వంటివి à°ˆ సెక్షన్ల కిందికి వస్తాయి.

80 డి కింద ఆరోగ్య బీమా (మామూలు వ్యక్తులకు రూ.25 వేలు, వృద్ధులకైతే రూ.30 వేలు) పై మినహాయింపు పోతుంది.

సెక్షన్‌ 80టీటీఏ à°•à°¿à°‚à°¦.. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ (రూ.10 వేల లోపు) మినహాయింపు పోతుంది.

ఈక్విటీ సేవింగ్‌ పథకాల్లో పెట్టే సొమ్ములో 50 శాతం (గరిష్ఠంగా రూ.25 వేలు)పై 80 సీసీజీ à°•à°¿à°‚à°¦ వర్తించే పన్ను మినహాయింపు లభించదు.

ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై సెక్షన్‌ 80ఈఈబీ à°•à°¿à°‚à°¦.. ఉన్నత విద్యకు తీసుకునే రుణాలపై వడ్డీకి సంబంధించి సెక్షన్‌ 80à°ˆ à°•à°¿à°‚à°¦ (దీనికైతే పరిమితి లేదు).. దాతృత్వ సంస్థలకు ఇచ్చే విరాళాలపై 80జీ à°•à°¿à°‚à°¦.. వైద్య ఖర్చులపై సెక్షన్‌ 80 డీడీబీ à°•à°¿à°‚à°¦.. ఉద్యోగులకు ఎల్టీసీ, హౌస్‌ రెంటు అలవెన్స్‌ (అద్దె భత్యం)à°•à°¿à°‚à°¦ ఇస్తున్న చాలా మినహాయింపులు పోతాయి.