భారత జవాన్లే తమ దళాలను రెచ్చగొట్టారని ఆరోపణ

Published: Wednesday June 24, 2020

 à°œà°¿à°‚గ్ పింగ్ నేతృత్వంలోని చైనా మళ్లీ అర్థం పర్థం లేని వాదనలకు దిగింది. భారత జవాన్లే తమ దళాలను రెచ్చగొట్టారని ఆరోపణలు చేస్తున్న చైనా... తాజాగా బుధవారం కూడా అవే అర్థం పర్థం లేని వాదనలకు దిగింది. గాల్వాన్ సంఘటన గురించి భారత విదేశాంగ శాఖ, రక్షణ శాఖతో పాటు భారత మీడియా కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించింది.

 

వీరందరూ  కలిసి తప్పుడు ప్రచారం చేస్తుండటం వల్లే ప్రపంచానికి తప్పుడు సమాచారం వెళుతోందని వ్యాఖ్యానించింది. భారత విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు కలిసి ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి, రెచ్చగొట్టే విధానాలకు పాల్పడ్డారని విమర్శించింది. ఇదే విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ....

 

‘‘అందరికీ పరిస్థితిని స్పష్టం చేయడానికి, నిజం చెప్పడమే నా వ్యాఖ్యల ఉద్దేశం. అలాంటి ప్రకటన ఎందుకు చేశానంటే భారత ప్రభుత్వం, భారత మీడియా తప్పుడు రిపోర్టులను ప్రచారం చేస్తోంది’’ అంటూ జావో లిజియన్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా చైనా అచ్చు ఇవే ఆరోపణలకు దిగడం విడ్డూరం.