విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Published: Friday July 03, 2020

ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యాసంవత్సరం ప్రారంభించలేదని విచారణ సందర్భంగా కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్థికంగా వెనుకబడిన వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లిఖితపూర్వకంగా ఈనెల 13à°¨ నిర్దిష్ట ప్రణాళిక కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆన్ లైన్ క్లాస్ పిటీషన్‌లో (ఇస్మా) ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఎస్‌సీ మార్గదర్శకాలకు అనుగుణంగా à°—à°¤ రెండు నెలల క్రితమే విద్యా సంవత్సరం ప్రారంభించామని ఇస్మా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్‌లైన్ క్లాసుల వలన తల్లిదండ్రులపై ఎలాంటి ఒత్తిడి లేదని కోర్టుకు వివరించారు. ఆన్‌లైన్ క్లాసులు తల్లిదండ్రులకు ఆప్షన్ మాత్రమేనని కోర్టుకు తెలిపారు. సీబీఎస్‌సీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని కోర్టుకు చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇస్మాకు హైకోర్టు అదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను à°ˆ నెల 13కు వాయిదా వేసింది. 

 

 

విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

 

ఆన్ లైన్ తరగతులపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుందని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. à°ˆ నెల 31వరకు విద్యా సంస్థలు తెరవద్దని కేంద్రం స్పష్టం చేసిందని, à°ˆ నెల తర్వాతే విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. విద్యా సంవత్సరం మొదలు కాక ముందే ఆన్ లైన్ తరగతులను ఎలా అనుమతిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్ లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేమని తెలిపింది. à°ˆ సందర్భంగా ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు అనుమతి ఇవ్వలేదంటూనే.. మరోవైపు అడ్డుకోవడం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో దాగుడు మూతలు ఆడకూడదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర మాదిరిగా స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోరని వ్యాఖ్యానించింది. విద్యార్థుల కెరీర్ కోసం నెల రోజులుగా ఆన్ లైన్  తరగతులు నిర్వహిస్తున్నామని విద్యా సంస్థల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విద్యార్థుల కెరీర్ స్తంభిస్తుందన్న హైకోర్టుకు విన్నవించారు. కార్మికులు, న్యాయవ్యవస్థతో పాటు ప్రపంచ మానవాళి జీవితమే స్తంభించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కో ఇంట్లో రెండు మూడు ల్యాప్ టాప్‌లు కొనే పరిస్థితి ఉందా అని ప్రశ్నించింది. ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, ఎన్సిటీఈని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. కేంద్రం, సీబీఎస్ఈ వాదనలు కూడా వింటామని తెలిపింది