ప్రధాని మోదీకి రఘురామరాజు లేఖ

Published: Monday July 20, 2020

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. వచ్చే నెల ఐదో తేదీన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే. à°ˆ నేపథ్యంలో ప్రధాన మంత్రి అకౌంట్‌కు తన విరాళాన్ని రఘురామకృష్ణం రాజు జమ చేశారు. రామాలయ నిర్మాణానికి ఉడతా భక్తిగా à°ˆ విరాళం ఇస్తున్నట్లు వెల్లడి చేశారు. à°ˆ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రపంచ వ్యాప్తంగా వందలకోట్ల హిందువులు రామాలయం భూమి పూజ కోసం ఎదురుచూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. 

 

రామాలయం నిర్మాణపనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించాలని ట్రస్ట్ నిర్ణయించింది. రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొంటారని తెలిపింది. ఆగస్టు నెలలో జరగనున్న ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖలు పాల్గొంటారని ట్రస్టు సభ్యులు వివరించారు.