మొట్ట మొదటి ప్రధాని నరేంద్ర మోదీయే

Published: Wednesday August 05, 2020

ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సృష్టించారు. అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్న మొట్ట మొదటి ప్రధాని నరేంద్ర మోదీయే. అయితే మోదీ కంటే ముందు ప్రధాని హోదాలో ఇందిరా, రాజీవ్, వాజ్‌పాయ్ అయోధ్యను ప్రధాని హోదాలో సందర్శించారు కానీ.... రామ జన్మభూమి (రామలల్లా)కు దూరంగా ఉండిపోయారు. భూమిపూజను పురస్కరించుకొని ప్రధాని హోదాలో దర్శించుకున్నారు. 

ఇందిరా గాంధీ

1966 లో ఇందిర అయోధ్య పర్యటన చేశారు. అయోధ్యలోని సరయూ నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. à°ˆ కార్యక్రమం పూర్తి కాగానే తిరిగి వెళ్లిపోయారు. దీని తర్వాత 1979 లో మళ్లీ అయోధ్యకు వచ్చారు. అప్పుడు హనుమాన్ గఢీ ఆలయానికి వెళ్లి హనుమంతుడ్ని దర్శించుకున్నారు. à°† తర్వాత 1975 లో నరేంద్ర దేవ్ వ్యవసాయ యూనివర్శిటీ శంకుస్థాపనకు వెళ్లారు. à°ˆ కార్యక్రమం పూర్తికాగానే ఢిల్లీకి బయల్దేరారు. à°ˆ మూడు పర్యటనల్లోనూ ఆమె రామ్‌లల్లాను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. 

 

ఈయన ప్రధాని హోదాలో రెండు సార్లు, పూర్వ ప్రధానిగా à°“ సారి అయోధ్యలో పర్యటించారు. ఈయన ప్రధానిగా ఉన్న సమయంలో 1986 లో బాబ్రీ మసీద్ తెరిచి, శిలాన్యాసం చేశారు. 1984 లో à°“ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అయోధ్య వచ్చారు. దీని తర్వాత 1989 లో ఎన్నికల ప్రచారాన్ని రాజీవ్ అయోధ్య నుంచే ప్రారంభించారు. 

 

ప్రధానిగా బాధ్యతలు చేపట్టక మునుపు అటల్ చాలా సార్లే అయోధ్యకు వచ్చారు. కానీ... ప్రధాని అయిన తర్వాత మాత్రం 2003 లో ప్రధాని హోదాలో వచ్చారు. అయితే రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామచంద్ర దాస్ పరమహంస్ మృతి చెందిన సమయంలో వచ్చారు. సరయూ తీరంలోనే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి వెనుతిరిగారు.

 

దీనికంటే ముందు కూడా à°“ సారి అటల్ అయోధ్యకు వచ్చారు. సరయూ నదిపై నిర్మించిన రైల్వే వంతన ప్రారంభోత్సవం చేసి వెళ్లిపోయారు. à°† తర్వాత 2004 లో ఫైజాబాద్‌లో జరిగిన à°“ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇన్ని సార్లు వచ్చినా... వాజ్‌పాయ్ మాత్రం రామ్ లల్లా దేవాలయాన్ని సందర్శించకుండానే వెనుదిరిగారు.