ఏపీలో విజృంభిస్తున్న కరోనా..

Published: Saturday August 08, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. à°—à°¤ 24 గంటలుగా ఏపీలో కొత్తగా 10,080  à°•à°°à±‹à°¨à°¾ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. à°—à°¡à°šà°¿à°¨ 24 గంటల్లో కరోనాతో 97 à°®à°‚ది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 1,939 à°®à°‚ది మృతి చెందారు. కర్నూలు జిల్లాలో- 1,353, తూర్పుగోదావరిలో- 1,310, అనంతపురంలో-976, చిత్తూరు జిల్లాలో- 963, నెల్లూరులో- 878, విశాఖపట్నం- 998, గుంటూరు- 601, à°•à°¡à°ª- 525, పశ్చిమ గోదావరిలో- 681, విజయనగరంలో- 450, శ్రీకాకుళంలో- 442, కృష్ణాలో- 391, ప్రకాశంలో- 512 à°•à±‡à°¸à±à°²à± నమోదయ్యాయి. 

 

ఏపీలో ఇప్పటి వరకు 24,24,393 à°®à°‚దికి కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 2,14,145 à°ªà°¾à°œà°¿à°Ÿà°¿à°µà± కేసులకు గాను 1,26,720 à°®à°‚ది డిశ్చార్జ్ కాగా 1,939 à°®à°‚ది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85,486. కాగా.. కర్నూలు, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. à°ˆ జిల్లాల్లో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి రోజూ ఏపీలో పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. అయితే.. టెస్టులు పెద్ద ఎత్తున చేస్తుండటంతో కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు.