3 లక్షల కేసులు దాటిన మూడో రాష్ట్రం

Published: Wednesday August 19, 2020

కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతోంది. సరిగ్గా 11 రోజుల్లోనే మరో లక్ష కొత్త కేసులు  నమోదయ్యాయి. వెరసి... మూడు లక్షల కేసులు దాటిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మహారాష్ట్ర, తమిళనాడుల్లో మాత్రమే 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు à°† జాబితాలో మూడో రాష్ట్రంగా ఏపీ చోటు దక్కించుకుంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ కొత్తగా 9,652 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌లు 3,06,261à°•à°¿ చేరాయి. రోజువారీ కేసుల్లో సైతం ఏపీ టాప్‌లోనే ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రోజుకు సగటున పదివేల కేసులు నమోదవడం లేదు. మహారాష్ట్రలోనూ రోజుకు 7-8 వేల కేసులు మాత్రం వెలుగు చూస్తున్నాయి. 

రాష్ట్రంలో తొలి లక్ష కరోనా కేసులకు 137 రోజులు పట్టింది. రెండో లక్ష మాత్రం కేవలం 11 రోజుల్లోనే వెలుగు చూశాయి. అనంతరం మూడో లక్ష కేసులు కూడా 11 రోజుల్లోనే నమోదయ్యాయి. జూలై 27నాటికి 1,02,349 పాజిటివ్‌లు ఉండగా, ఆగస్టు 7 నాటికి à°† సంఖ్య 2,06,960à°•à°¿ చేరింది. 18à°¨ 3లక్షలు దాటింది. à°ˆ స్థాయిలో కేసులు మరే రాష్ట్రంలో నమోదు కావడం లేదు. రాష్ట్రంలో కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి మరో లక్ష మంది కరోనా బారిన పడినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. 

 

రాష్ట్రంలో మంగళవారం 9,211మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 2,18,311మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మంగళవారం కొవిడ్‌ మరో 88మందిని బలి తీసుకుంది. చిత్తూరులో 14మంది, ప్రకాశంలో 11మంది, అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 9మంది చొప్పున, నెల్లూరులో ఏడుగురు, పశ్చిమ గోదావరి ఆరుగురు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పు గోదావరిలో నలుగురు, కృష్ణాజిల్లాలో ముగ్గురు, కడపలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 2,820à°•à°¿ పెరిగాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో మృతుల సంఖ్య 306కు చేరింది.