స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ఏపీ హైకోర్టు విచారణ

Published: Tuesday August 25, 2020

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అరెస్ట్‌పై స్టే కోరుతూ డాక్టర్ రమేష్ వేసిన క్వాష్ పిటిషన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారించింది. సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు.. డాక్టర్ రమేష్‌తో పాటు ఆస్పత్రిపై కూడా చర్యలు తీసుకోకుండా హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏళ్ల తరబడి హోటల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కోర్టు తెలిపింది. హోటల్‌లో కోవిడ్ నిర్వహణకు అధికారులు అనుమిచ్చారన్న విషయాన్ని కూడా కోర్టు à°ˆ సందర్భంగా ప్రస్తావనకు తెచ్చింది.

అనుమతులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీహెచ్ఎంవో కూడా à°ˆ అగ్ని ప్రమాదానికి బాధ్యులేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసులో అధికారులనూ నిందితులను చేరుస్తారా..? అని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు.. డాక్టర్ రమేష్‌ను అరెస్ట్ చేయకుండా ఉంటారా..? తామే ఉత్వర్వులు ఇవ్వాలా..? అని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని కోర్టుకు తెలిపారు.

మరోవైపు.. రమేష్ ఆస్పత్రి కేసులో జిల్లా కోర్టు విచారణ జరిపింది. అరెస్టయిన వైద్యులు రాజగోపాల్‌రావు, సుదర్శన్, వెంకటేష్‌ బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. కేసు విచారణ దశలో ఉండగా బెయిల్ ఇవ్వలేమని జిల్లా కోర్టు తేల్చిచెప్పింది. à°ˆ క్రమంలో రేపు అనగా బుధవారం నాడు హైకోర్టును ఆశ్రయించే యోచనలో నిందితులు ఉన్నట్లు తెలియవచ్చింది. ఇదిలా ఉంటే.. కోవిడ్ కేర్ సెంటర్‌‌లో జరిగిన à°ˆ అగ్ని ప్రమాదంలో 10 చనిపోవడం తెలిసిందే.