అంతర్వేది ఘటనపై పవన్‌కల్యాణ్

Published: Thursday September 10, 2020

అంతర్వేది రథం దగ్ధంపై పోలీసులు నమ్మశక్యం కానీ కారణాలు చెబుతున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ధర్మ పరిరక్షణ దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారు. ‘ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వ నిర్లిప్తత... కాలయాపనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దుశ్చర్యలకు కారకులపై చర్యలు కోరుతుంటే... తమను అస్థిరపరచే పనులు అంటూ ప్రభుత్వం అర్థం లేని వాదన చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం.. పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలోనే అసలు దోషులను పట్టుకుని à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుని ఉంటే à°ˆ పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావు. మతిస్థిమితం లేనివారి చర్య అని ఉదాసీనంగా తేల్చేయడం వల్లే వరుస ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. కరోనా విపత్తు ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రజలు తమ నిరసనలు తెలియజేసేందుకు రోడ్ల మీదకు వస్తున్నారు. వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. వారి మనోభావాలు ఏ విధంగా దెబ్బ తిన్నాయో ప్రభుత్వం గ్రహించాలి’ అని పవన్‌కల్యాణ్ కోరారు.

 

 

‘పోలీసులు చెప్పే కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రాజకీయాలంటే ఆసక్తి లేని మహిళలు, పిల్లలు కూడా వీటిని విని విస్తుపోతున్నారు.. నవ్వుతున్నారు. మతిస్థిమితం లేనివారు కేవలం హిందూ దేవాలయాలను, రథాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొంటున్నారా? ప్రభుత్వంలో బాధ్యత కలిగినవాళ్ళు ఇందుకు భిన్నంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని అర్థం లేని వాదన వినిపిస్తున్నారు. 151 మంది ఉన్నారు కదా... మిమ్మల్ని ఎవరు అస్థిరతకు గురిచేస్తారు. వరుసగా చోటుచేసుకొంటున్న à°ˆ ఘటనలపై బలమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? భక్తుల మనోభావాలు కాపాడండి. à°’à°• భావోద్వేగంతో బయటకు వచ్చారు’ అని పవన్‌కల్యాణ్ తెలిపారు.