నిర్మాత నూతన్‌ నాయుడిని పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతి

Published: Saturday September 12, 2020

నిర్మాత నూతన్‌ నాయుడిని పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. పెందుర్తి పీఎస్‌లో నూతన్‌నాయుడిని పోలీసులు విచారించనున్నారు. విశాఖలో కలకలం రేపిన శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు అరెస్ట్‌ అయ్యాడు. à°ˆ కేసులో నూతన్‌నాయుడు భార్య మొదటి ముద్దాయిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె రిమాండ్‌లో ఉన్నారు. à°ˆ కేసులో మొదట ఏడుగుర్ని పోలీసులు  అరెస్ట్ చేశారు. ఉడిపిలో నూతన్‌ను అరెస్ట్ చేశారు. అయితే నూతన్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఐఏఎస్‌ పీవీ రమేష్‌ పేరిట బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. à°† తర్వాత పలు విషయాలు కూడా వెలుగు చూశాయి. 

 

 

తాజాగా.. నూతన్‌పై మరో రెండు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. à°ˆ క్రమంలో సెంట్రల్ జైల్ నుంచి మరోసారి విచారణకు గాను పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన à°“ వ్యక్తికి బ్యాంకులో డైరెక్టర్ పోస్ట్ ఇప్పిస్తానంటూ రూ. 20 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. మరోవైపు.. తెలంగాణకు చెందిన వ్యక్తికి ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నాలుగు లక్షలు వసూలు చేసినట్లు కూడా తేలింది.