వామ్మో పవన్ దీక్షలో "ఆ" ఎమ్మెల్యే భార్య

Published: Sunday May 27, 2018

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని నిరసిస్తూ పవన్ తన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ నిన్న ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న దీక్షకు సంఘీభావంగా జనసేన కార్యకర్తలు సైతం ఆయా ప్రాంతాల్లో ఒక్క రోజు దీక్ష చేపట్టారు. అయితే రాజమండ్రిలో జనసేన ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీ పద్మావతి పాల్గొనడం ఆసక్తిని రేపుతుంది.

కాగా రాజమండ్రిలో ఈ ఒక్క రోజు నిరాహార దీక్ష ఆమె నేతృత్వంలోనే జరగడం గమనార్హం. నిజానికి ఎమ్మెల్యే సతీమణి గారు బయటకి రావటం చాలా అరుదు. ఇంకా చెప్పాలంటే ఆమెను రాజమండ్రి ప్రజలు అసలు చూడనేలేదు. అలాంటిది ఆమె బీజేపీ జెండా కాకుండా ఆమె ఏకంగా పవన్ ఫోటో ఉన్న జనసేన జెండాను పట్టుకొని సుబ్ కలెక్టరేట్ ఎదుటనున్న దీక్షా శిబిరానికి రావటం అందరినీ ఆశ్చర్యకితులను చేసింది. దీంతో ఆమె జనసేనలో చేరబోతుందా అన్న ఊహగానాలు ఎక్కువయ్యాయి.

ఇదే విషయాన్ని మీడియా ప్రతినిదులు ఆమెను అడగ్గా పవన్ అంటే తనకు చాలా అభిమానమని, జనసేన సిద్ధాంతాలు నచ్చాయని చెప్పిన ఆమె ఉద్దానం భాదితుల కోసం పవన్ చేస్తున్న పోరాటం నచ్చడంతోనే ఇలా దీక్షకు కూర్చునట్లు తెలిపింది. గతంలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరయ్యానని తెలిపిన ఆమె తాను రాజకీయాలలో ప్రవేశించనని చెప్పింది. అంతేగాక తాను జనసేనలో ఏ విధమైన పదవిని ఆశించడంలేదని చెప్పుకొచ్చింది. కాగా ఆమె దీక్షలో పాల్గొనడం పట్ల ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎటువంటి వాఖ్యలు చేయలేదు.