ఏపీలో కొత్తగా 2,410 కరోనా కేసులు

Published: Friday November 06, 2020

 à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,410 కరోనా కేసులు నమోదయ్యాయి. à°ˆ రోజు నమోదయిన కేసులతో కలిసి రాష్ట్రంలో 8,38,363 కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 6,768 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 21,825 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 8 లక్షల 9 వేల 770 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 85.07 లక్షల కరోనా టెస్టులు చేశారు. 

 

à°ˆ రోజు కరోనాతో కృష్ణా 3, చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, à°•à°¡à°ª, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మూతబడ్డ పాఠశాలలు సుమారు ఏడు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలల్లో కరోనా భూతం విజృంభిస్తోంది. బడులు తెరిచిన నాలుగు రోజుల్లోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్‌ బారిన పడ్డారు. à°ˆ నెల 2 నుంచి 9,, 10à°µ తరగతుల విద్యార్థులకు రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు.