పర్వతారోహణకు వెళ్లి.... తెలుగు యువకుని మృతి

Published: Thursday May 31, 2018

అమెరికాలోని కాలిఫోర్నియాలో పర్వతారోహణకు వెళ్లిన ప్రవాసాంధ్రుడు పెనుగొండ ఆశిష్‌(29) ప్రమాదవశాత్తు మృతి చెందారు. యెసెమైట్‌ జాతీయ పార్కులో ప్రఖ్యాత హాఫ్‌ డ్రోమ్‌ పర్వతారోహణలో à°ˆ అపశ్రుతి చోటు చేసుకుంది. హాఫ్‌ డోమ్‌ అనేది గ్రానైట్‌ పర్వతం. దీనిపై 45 డిగ్రీల వాలు ఉండే ప్రాంతంలో సుమారు 182 మీటర్ల దూరం వరకు కేబుల్స్‌ అమర్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఆశిష్‌ à°—à°¤ మంగళవారం మిత్రులతో కలిసి à°ˆ కొండను ఉత్తరం వైపు నుంచి అధిరోహిస్తున్న సమయంలో ఉరుములతో కూడిన గాలివాన సంభవించింది. దీంతో ఆయన కేబుల్‌ పట్టుతప్పి జారి à°•à°¿à°‚à°¦ పడి మృతి చెందారు. ఆశిష్‌ జారిపడిపోవడం గమనించిన పార్కు సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రమాదంలో ఉన్న మరో యువకుడిని కాపాడారు. ఫెయిర్లే డికిన్సన్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆశిష్‌ న్యూజెర్సీలోని సీమెన్స్‌ హెల్త్‌కేర్‌ సంస్థలో బయోకెమిస్ట్‌à°—à°¾ పనిచేస్తున్నారు.