పోలవరం వ్యయం రూ.55,548 కోట్లు

Published: Saturday December 26, 2020

పోలవరం వ్యయం రూ.55,548 కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖ గుర్తించింది. 2020 ఏడాదికి గానూ వార్షిక నివేదికను కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసింది. వార్షిక నివేదికలో పోలవరంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక ప్రస్తావించింది. 2017-18 ధరల పట్టిక ప్రకారం పోలవరం వ్యయాన్ని రూ.55,548 కోట్లుగా అంగీకారించారు. ఇప్పటివరకు రూ.8,614 కోట్లు పోలవరానికి విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఈ ఏడాది రూ.1,850 కోట్లు, వచ్చే ఏడాది 2,234 కోట్లు కేంద్రం విడుదల చేయనుంది. 2020 జనవరి వరకు పోలవరానికి కేంద్ర జలశక్తి శాఖ రూ.17,327 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.