భారత్‌లో కొత్తగా మరో 4 స్ట్రెయిన్ కేసులు

Published: Friday January 01, 2021

యూకేను వణికిస్తున్న కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ భారత్‌లోనూ క్రమంగా ప్రభావాన్ని చూపుతోంది. భారత్‌లో కొత్తగా మరో నాలుగు స్ట్రెయిన్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. భారత్‌లో మొత్తం స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29à°•à°¿ చేరింది. à°—à°¡à°šà°¿à°¨ మూడు రోజుల వ్యవధిలో 25 మందికి స్ట్రెయిన్ వైరస్ పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ కావడం గమనార్హం. మొత్తం స్ట్రెయిన్ కేసుల్లో న్యూఢిల్లీలో 10, పశ్చిమ బెంగాల్‌లోని ఎన్‌ఐబీఎంజీ కల్యాణిలో 1, పుణెలో 5, హైదరాబాద్‌లో మూడు, బెంగళూరులో 10 కేసులు నమోదయినట్లు కేంద్రం ప్రకటించింది. యూకేలో కలకలం రేపుతున్న à°ˆ స్ట్రెయిన్ వైరస్ పలు ప్రపంచ దేశాల్లో ప్రభావం చూపుతోంది.

 

 

యూకేతో పాటు భారత్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ దేశాల్లో స్ట్రెయిన్ కేసులు నమోదవడం గమనార్హం. స్ట్రెయిన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యూకే నుంచి ప్రయాణాలపై భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాలు నిషేధం విధించాయి. యూకేలో సెప్టెంబర్ 21à°¨ కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ తొలి కేసు వెలుగుచూసింది