విశాఖ స్టీల్ ప్లాంట్‌‌‌పై సుజనాచౌదరి వ్యాఖ్యలు

Published: Friday February 05, 2021

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌‌పై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌‌‌‌ను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆయన సమర్థించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులు పెంచేందుకే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌‌ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలిపారు. షేర్‌ హోల్డర్లకు లాభాలు తెచ్చేందుకే ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌పై ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే à°ˆ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ విశాఖలోనే ఉంటుందని, వేరే దేశానికి తీసుకెళ్లేది కాదని చెప్పారు. టీడీపీ, వైసీపీ ఆందోళన చేసినంత మాత్రాన ప్రైవేటీకరణ మాత్రం ఆగదని సుజనాచౌదరి స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. టీడీపీ, వామపక్ష నేతలు మద్దతు తెలిపారు.