కుట్రదారు కంటే తేయాకు కార్మికులే అత్యంత బలీయులు.

Published: Sunday February 07, 2021

కొందరు విదేశాల్లో కూర్చొని దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అలాంటి వారు కనీసం భారత్‌కు చెందిన ఛాయ్‌ని కూడా భరించే స్థితిలో లేరని ఆరోపించారు. à°…సోంలోని దేఖియాజూలీలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.  ‘‘నేను ఛాయ్‌వాలా గురించి మాట్లాడుతున్నాను. దేశాన్ని కొందరు ఎలా అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారో మీకు వివరిస్తా. ఎంతలా కుట్ర పన్నుతున్నారంటే.. కనీసం భారత్‌కు చెందిన ఛాయ్‌ని కూడా ద్వేషించేంతలా. భారత్‌కు చెందిన ఛాయ్‌à°•à°¿ à°Žà°‚à°¤ ఇమేజ్ ఉందో, దానంతటినీ ధ్వంసం చేయాలని చూస్తున్నారు. భారత్‌కు చెందిన ఛాయ్‌à°•à°¿ విదేశాల్లో మంచి పేరుందని, à°† పేరును తుడిచేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.’’ అని మోదీ తీవ్రంగా ఆరోపించారు. 

 

ఇంత జరుగుతున్నా, రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయని మోదీ ఆరోపించారు. ఛాయ్ అభిమానులు, తేయాకు పండించే వారందరూ పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చారు. మీరెంత కుట్ర చేయాలని చూసినా, à°† కుట్రలు సఫలం కాకుండా చూస్తామని, వాటిని తుత్తునీయలు చేస్తామని స్పష్టం చేశారు. à°ˆ కుట్రను తేయాకు కార్మికులు కచ్చితంగా ఛేదిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘కుట్రదారులారా... మీ కుట్రలను అడ్డుకుంటాం. సఫలం కానివ్వం. తుత్తునీయలు చేస్తాం. à°ˆ కుట్రను తేయాకు కార్మికులూ ఛేదిస్తారు. కుట్రదారు కంటే తేయాకు కార్మికులే అత్యంత బలీయులు.’’ అని మోదీ ప్రకటించారు.