కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్

Published: Thursday March 11, 2021

 à°®à°¹à°¾à°°à°¾à°·à±à°Ÿà±à°°à°²à±‹ రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. à°ˆ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ కూడా విధించారు. తాజాగా నాగపూర్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. à°ˆ నెల 15 నుంచి 21 వరకూ లాక్‌డౌన్ అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కేవలం అత్యవసర, ఎమర్జెన్సీ పనులు ఉన్నవారు మాత్రమే బయటికి రావాలని పోలీసులు సూచించారు. నాగపూర్‌లో ఒక్కరోజులోనే 1710 కేసులు వెలుగు చూశాయి. 173 రోజుల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాదు ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. నాగపూర్ మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ... ‘‘కరోనాను ప్రజలు అత్యంత సహజంగా తీసుకుంటున్నారు. సీరియస్‌à°—à°¾ తీసుకోవడం లేదు. ప్రజల సహకారం తప్పకుండా కావాలి. అయితేనే ఏదైనా మార్పు తీసుకురాగలం. ఇప్పటికి పాక్షికంగానే లాక్‌డౌన్ విధించాం. కేసులు పెరిగి, పరిస్థితి అదుపు తప్పితే మాత్రం పూర్తి స్థాయి లాక్‌డౌన్ తప్పదేమో.’’ అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.