ఇసుక ర్యాంపులో ఎస్ఈబీ సోదాలు

Published: Tuesday March 16, 2021

పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం పక్కిలంక ఇసుక ర్యాంపులో ఎస్ఈబీ అధికారుల సోదాలు నిర్వహించారు. బంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. మూడు మీటర్ల లోతులో 17 వేల 400 క్యూబిక్ మీటర్ల మేర అక్రమ తవ్వకాలు నిర్వహించారు. 65 లక్షల రూపాయల విలువైన ఇసుక అక్రమ నిల్వకు పాల్పడ్డారు. నలుగురు వ్యక్తులపై ఎస్ఈబీ అధికారులు కేసు నమోదు చేశారు.