వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు

Published: Sunday April 18, 2021

వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో రికార్డు సృష్టించింది. కేవలం 92 రోజుల్లోనే ఏకంగా 122 మిలియన్ల మందికి టీకాలు వేసిన తొలి దేశంగా రికార్డులకెక్కింది. à°ˆ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. 12 కోట్ల మందికి టీకాలు వేసేందుకు అమెరికాకు 97 రోజులు పట్టగా, చైనాకు 108 రోజులు పట్టిందని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో à°—à°¤ 24 గంటల్లోనే 2.6 మిలియన్ల మందికి టీకాలు వేశారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 12,26,22,590à°•à°¿ పెరిగింది.  

 

దేశంలో à°ˆ ఏడాది జనవరి 16à°¨ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, రక్షణ సిబ్బంది, పోలీసులు, ఇతర పారామిలటరీ సిబ్బందికి వ్యాక్సిన్లు వేశారు. మార్చి 1à°¨ ప్రారంభమైన రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్లు వేశారు.  ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు ఇస్తున్నారు.