బంగాళాఖాతంలో వాయుగుండం

Published: Sunday March 20, 2022

ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్ర పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయానికల్లా వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర ఈశాన్యంగా పయనించి ఆదివారం మధ్యాహ్ననికి కార్‌నిరోబార్‌ దీవులకు 140 à°•à°¿.మీ. ఉత్తరంగా, పోర్టుబ్లెయిర్‌కు 140 à°•à°¿.మీ. దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తరంగా అండమాన్‌ దీవుల మీదుగా పయనించే క్రమంలో సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, ,రాత్రికి తుఫాన్‌à°—à°¾ మరింత బలపడనున్నది. దీనికి ‘అసాని’ అని పేరు పెట్టనున్నారు. ఇదిలావుండగా 1891 నుంచి 2020à°µ సంవత్సరం వరకు మార్చి నెలలో ఉత్తర హిందూ మహాసముద్రంలో ఎనిమిది తుఫాన్లు ఏర్పడగా వాటిలో ఆరు బంగాళాఖాతంలోనే ఏర్పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటిలో తీవ్రతుఫాన్‌ 1907లో శ్రీలంకలో, తుఫాన్‌ 1925లో తమిళనాడు వద్ద తీరం దాటాయని పేర్కొంది.