ఇళ్లు కూల్చివేత...ప్రజల ఆవేదన

Published: Wednesday June 27, 2018

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం రాజేంద్రనగర్‌లో à°—à°¤ 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను పోలీస్‌శాఖ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కూల్చివేత చేపట్టారు. దీంతో ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు కన్నీటి పర్యంతమవతున్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన à°† ప్రాంతంలో వాటర్ ట్యాంక్ కట్టేందుకు నిర్ణయించారు. à°ˆ క్రమంలో అక్కడి ఇళ్లను తొలగించాలని నిర్ణయించిన అధికారులు అందులో నివాసముంటున్న ప్రజలకు వేరే ప్రాంతాల్లో ఇళ్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో à°ˆ ఉదయం రాజేంద్రనగర్‌కు చేరుకున్న అధికారులు జేసీబీల సాయంతో ఇళ్లను కూల్చే ప్రక్రియను ప్రారంభించారు. అయితే వేరే ప్రాంతాల్లో ఇళ్లు కట్టించి ఇవ్వక ముందే ఇక్కడ ఉంటున్న ఇళ్లను కూల్చివేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నఫలంగా ఎక్కడికి  à°µà±†à°³à±à°²à°¾à°²à°‚టూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.