ఇంత అమానుషమా

Published: Sunday September 23, 2018

పేదా గొప్పా తేడా లేదు.. మనిషి చనిపోతే మట్టిలో కలిసిపోవాల్సిందే.. కానీ.. మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది మాత్రం à°“ మృతదేహాన్ని చెత్తకుప్పలో కలిపేసి అమానుషంగా ప్రవర్తించారు. గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారి పాత టోల్‌గేట్‌ అండర్‌పాస్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు వెళ్లి పంచనామా చేసి మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించాల్సిందిగా మున్సిపల్‌ శానిటరీ అధికారులను కోరారు. కానీ మున్సిపల్‌ సిబ్బంది ఫుట్‌పాత్‌ పక్కనే ఉన్న చెత్తలో మృతదేహాన్ని కప్పేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం వరకు చెత్తలో ఉన్న à°† మృతదేహాన్ని కుక్కలు పీకుతుండడంతో గమనించిన స్థానికులు మళ్లీ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతోవారు మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు.