పవన్‌కు కీలక సూచననిచ్చిన ఏపీ మంత్రి

Published: Sunday September 30, 2018

విజయవాడ: à°ªà±à°°à°¾à°£à°¹à°¾à°¨à°¿ ఉందన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ఎవరిపైనైనా అనుమానం ఉంటే à°† జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రశాంత ప్రాంతాలుగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో కులాలు, మతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదని అన్నారు. à°† రెండు జిల్లాలు రాష్ట్రానికే ధాన్యాగారాలని వివరించారు. ప్రజలు జగన్‌ను à°“à°¡à°¿à°‚à°šà°¿ అదృష్టవంతులవడమే కాకుండా.. చంద్ర బాబును గెలిపించి అభివృద్ధిలో భాగస్వాము లయ్యారని చెప్పారు.