విద్యుత్‌శాఖ ఉద్యోగులు భారీ విరాళం 7 కోట్లు

Published: Saturday November 17, 2018

అమరావతి: à°¤à°¿à°¤à°²à±€ తుఫాను బాధితులకు విద్యుత్‌శాఖ ఉద్యోగులు భారీ విరాళాన్ని అందజేశారు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ ఉద్యోగులు సంయుక్తంగా రూ.7,18,87,603 చెక్కును శుక్రవారం ఉండవల్లి ప్రజావేదికలో మంత్రి కళా వెంకట్రావు సమక్షంలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఏపీ పవర్‌ జేఏసీ, తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌, విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంఘం ఇతర యూనియన్ల ప్రతినిధులు à°ˆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ కూడా సీఎం రీలీఫ్‌ ఫండ్‌కు రూ.25 లక్షల చెక్కును అందజేస్తున్నట్టు టెక్‌ సదస్సులో ఏపీయూఎస్‌ఎంఏ అధ్యక్షుడు ఏ.కృష్ణారెడ్డి తెలిపారు.