చంద్రబాబు కేంద్రంగా నేతల కసరత్తు!

Published: Sunday November 18, 2018
నాలుగున్నరేళ్లు గమ్మున ఉంటాయి! సరిగ్గా ఎన్నికల సమయంలో పూనకం వచ్చినట్లు ఊగిపోతాయి. ఎడతెగకుండా, ఊపిరి తీసుకోనివ్వకుండా ఎడాపెడా దాడులకు దిగుతాయి. ఇదీ కేంద్ర సంస్థల తీరు. కేంద్రం గుప్పిట అవి అస్ర్తాలుగా మారి.. రాజకీయ ప్రత్యర్థులను గురి చూస్తున్నాయి. దక్షిణాది, ఉత్తరాది అని లేకుండా ఎక్కడ చూసినా ఇప్పుడు à°ˆ సంస్థల హడావుడే కనిపిస్తోంది. దీంతో ఎన్నికలకు ఆరు నెలల ముందు కేంద్ర సంస్థల ముందరి కాళ్లకు బంధాలు వేయాలన్న డిమాండ్‌ ఊపందుకొంది. తక్షణం వాటిని కట్టడి చేయాలని దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. దీనికోసం పెద్దఎత్తున పోరాటానికీ అవి సిద్ధమవుతున్నాయి. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలనే ఆలోచన చేస్తున్నాయి. అవినీతిపరులు, పన్ను ఎగవేతదారులపై దృష్టిపెట్టాల్సిన సంస్థల్ని ...మోదీ సర్కారు తమ ప్రత్యర్థి పార్టీలపైకి మళ్లిస్తోందన్న ఆరోపణ వినిపిస్తోంది. విమర్శలే కాదు..ఇవి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిరూపితం అయ్యాయి కూడా.
 
అందుకే ఎన్నికలకు ఆరునెలల ముందు à°ˆ వ్యవస్థల్ని నియంత్రించాలన్న డిమాండ్‌ను పలు రాజకీయ పార్టీలు లేవనెత్తనున్నాయి. à°ˆ విషయంలో వెనక్కి తగ్గొద్దని, చివరకు సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికీ వెనుదీయరాదని గట్టిగా భావిస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో à°’à°• ఆలోచన కూడా జరిగిందని తెలిసింది. దేశంలోని ప్రతి వ్యవస్థనూ మోదీ ప్రభుత్వం తన గుప్పిట్లోకి తెచ్చుకుందని, ఈడీ, ఐటీ శాఖలను కూడా ఇదేవిధంగా చేసిందని పలు పార్టీలు విమర్శిస్తున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నియంత్రణలో ఈడీ, ఐటీలు ఉంటాయి. అయితే సీబీడీటీ నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉంటుంది. దేశంలో అక్రమార్కులు, పన్ను ఎగవేతదారులపై దాడులకు, వారి పని పట్టేందుకు ఉన్న à°ˆ వ్యవస్థలు...ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేసే అస్ర్తాలుగా మారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
 
ప్రత్యర్థులపైనే పనిగట్టుకొని..
ప్రత్యర్థులు కదలకుండా, వారి ఆర్థిక వ్యవహారాల్ని ఛిన్నాభిన్నం చేసి..వాటిలోంచి తేరుకునే లోపు ఎన్నికల్లో గట్టెక్కాలన్న వ్యూహంతో కేంద్రం వెళ్తోందని పలు రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి. కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపైనా, వారికి ఆర్ధిక సహకారం అందించేవారిపై ఐటీ, ఈడీ సంస్థలు దాడులు జరిగాయి. తమిళనాడులో అధికార రాజకీయాల్ని తమ చేతిలోకి తీసుకోవడానికి, అక్కడా ఐటీ దాడులు చేయించారనే ఆరోపణలున్నాయి. గుజరాత్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నెహ్రూ-గాంధీల కుటుంబానికి సన్నిహితుడు అహ్మద్‌ పటేల్‌ పోటీచేసినప్పుడు...అతన్ని ఓడించేందుకు కూడా ఈడీ, ఐటీ సంస్థల్ని ప్రయోగించారు.
 
‘దేశం’ మూలాలపై గురి
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో పెద్దఎత్తున ఐటీ దాడులు చేశారు. నేరుగా తెలుగుదేశం పార్టీ నేతలు, వారి మద్దతుదారులపైనే à°ˆ దాడులను కేంద్రీకరించడం గమనార్హం. సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, బీద మస్తాన్‌రావు తదితరులపై ఐటీ దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు తెలంగాణలోను దేవేందర్‌గౌడ్‌ కుమారులు డైరక్టర్లుగా ఉన్న కంపెనీపై దాడులు చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఐదేళ్ల సమయం ఉన్నా...కేవలం ఎన్నికల ముందే దాడులకు పాల్పడడం వెనక రాజకీయ కుట్రే కారణమని పలు పార్టీలు వాదిస్తున్నాయి.